బుల్లితెరపై టాప్ యాంకర్ లు ఎవరంటే ఆ లిస్ట్ లో యాంకర్ అనసూయ పేరు ఖచ్చితంగా ఉంటది. విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్న యాంకర్స్ లో అనసూయ ఒకరు. ఇక బుల్లితెర పైనే కాదు వెండితెరపై కూడా అనసూయకు లక్ బాగానే కలిసొచ్చింది. క్షణం సినిమాలో విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించిన అనసూయ.. ఆతర్వాత వచ్చిన రంగస్థలంలోని రంగమత్త పాత్ర మాత్రం సినీ కెరీర్ టర్నింగ్ పాయింట్ అయింది. రంగమ్మత్త క్యారెక్టర్ తో అనసూయ బదులు రంగమ్మత్త అని పిలుచుకునేంత బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు పలు సినిమాల్లో పలు కీలక పాత్రల్లో అనసూయకు అవకాశాలు దక్కుతున్నాయి. ఇక సినిమాల్లో అవకాశాలు వస్తున్నా, ఆమె బుల్లితెరను వదిలేయకుండా కెరియర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటోంది. తనకి నచ్చిన పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంటూ వెళుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఇప్పటి వరకు టాలీవుడ్కే పరిమితమైన అనసూయ త్వరలోనే బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమెకు బాలీవుడ్లో అవకాశం వచ్చిందని, అయితే సినిమాలో కాదు.. సీరియల్లో అని టాక్. హిందీలో ఒక ఫేమస్ సీరియల్లో ఓ కీలక పాత్ర కోసం అనసూయను మేకర్స్ సంప్రదించారంటున్నారు. సీరియల్లో నటించేందుకు తక్కువ రోజులే డేట్స్ అనసూయను అడిగినట్లుగా తెలుస్తోంది. దీంతో డేట్స్ కూడా ఎడ్జస్ట్ కావడంతో దీనికి అనసూయ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు. ఈ వార్తలపై అనసూయనే క్లారిటీ ఇవ్వాలి మరి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: