రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాతగా ఆకాశవాణి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. విభిన్నమైన స్టోరీ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఎప్పుడో మొదలైన ఈ సినిమా మాత్రం ఇప్పటివరకూ రిలీజ్ కాలేదు. ఇక గత రెండు రోజులుగా ఈ సినిమానుండి కార్తికేయ తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నసంగతి తెలిసిందే. ఐతే ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ ఎస్ ఎస్ కార్తికేయ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఆకాశవాణి మూవీ టీమ్ తో పనిచేయం గొప్ప అనుభూతి అని తెలిపారు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నాను అని చెప్పారు. అందుకు కారణంగా ఆయన ఆకాశవాణి సినిమా దర్శకుడితో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ అని చెప్పారు. దానితో పాటు మిగతా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడం వలన కూడా ఈ నిర్ణయం తీసుకున్నాని లేఖలో వివరించారు. మరిదీనిపై చిత్రయూనిట్ యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Some journeys have to come to an unexpected end…
Wishing the best to my friend, director @AshwinGangaraju and the entire team on the project. #Aakashavaani pic.twitter.com/aZfDtsheAZ— S S Karthikeya (@ssk1122) May 9, 2020
కాగా రాజమౌళి దగ్గర చాలా సినిమాలకు పనిచేసిన కార్తికేయ.. యుద్ధం శరణం సినిమాకు లైన్ ప్రొడ్యూసర్ గా చేసి ఇప్పుడు ఆకాశవాణి అనే సినిమాతో పూర్తిగా నిర్మాతగా మారిపోయాడు. ఇక రాజమౌళి దగ్గరే పనిచేసిన అశ్విన్ గంగరాజు ఈసినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాకు కీరవాణి కొడుకు కాలభైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: