‘బాహుబలి’ సిరీస్తో పాన్ ఇండియా స్టార్గా అవతరించాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆ ఇమేజ్కి తగ్గట్టుగానే కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడీ ‘డార్లింగ్’ స్టార్. ప్రస్తుతం ‘జిల్’ దర్శకుడు రాధాకృష్ణ కాంబినేషన్లో ఓ పిరియాడిక్ లవ్ స్టోరీ చేస్తున్న ప్రభాస్.. అనంతరం ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో భారీ బడ్జెట్ మూవీ చేయబోతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వైజయంతీ మూవీస్ అధినేత సి.అశ్వనీదత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. పాన్ – వరల్డ్ మూవీగా రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి నిర్మాత అశ్వనీదత్ ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే.. “ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు చూసే కథను ప్రభాస్ కోసం రాశాడు నాగ్ అశ్విన్. ఆ కథ విని ఎంతో ఆశ్చర్యపోయాను. రూ.వందల కోట్లతో రూపొందే బృహత్తర ప్రాజెక్ట్ ఇది. 2020 అక్టోబర్లో చిత్రీకరణను ప్రారంభించి 2022 ఏప్రిల్ లోపు రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని చెప్పుకొచ్చారు.
మరి.. 2022 వేసవిలో రాబోతున్న ‘ప్రభాస్ 21’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: