యువ కథానాయకుడు శర్వానంద్, టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్లో ఓ పిరియాడిక్ రొమాంటిక్ సాగా రాబోతున్న సంగతి తెలిసిందే. 1910 నుంచి 2021 వరకు సాగే ప్రేమకథా చిత్రమిది. కాగా, ఈ క్రేజీ ప్రాజెక్ట్లో శర్వానంద్ సరసన ముగ్గురు నాయికలు సందడి చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు చందు మొండేటి స్వయంగా వెల్లడించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంతేకాదు.. ఈ సినిమాలో శర్వానంద్ కొత్త తరహాలో కనిపిస్తాడని, అలాగే శర్వానంద్కు సరికొత్త ఇమేజ్ను తీసుకొచ్చే చిత్రమిదని చందు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ‘కార్తికేయ 2’ తరువాత తన దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ఇదేనని చందు తెలిపాడు. మరి.. ఈ పిరియాడిక్ లవ్ స్టోరీ శర్వానంద్కి ఎలాంటి గుర్తింపుని తీసుకొస్తుందో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: