ప్రాణాంతక కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ సమయం లో షూటింగ్స్ నిలిచిపోయి సినీ సెలబ్రిటీస్ ఇళ్ళకే పరిమితం అయిన విషయం తెలిసిందే. ఇంటి పనులు, పాత సినిమాలు, కుకింగ్, వర్క్ అవుట్స్, బుక్ రీడింగ్, ఆన్ లైన్ క్లాసెస్, ఇంటి సభ్యులతో ఎంజాయ్ చేయడం వంటి వాటితో సెలబ్రిటీస్ లాక్ డౌన్ సమయాన్ని వినియోగించుకుంటున్నారు. మెగా స్టార్ చిరంజీవి కరోనా వ్యాధి పై ప్రజలలో అవగాహన కల్పించడానికి ట్వీట్స్ చేస్తూ, కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా సినీ కార్మికుల సంక్షేమానికై పాటు పడుతూ, ఇల్లు క్లీనింగ్, గార్డెనింగ్ పనులతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఇంటి సభ్యులతో “ఫుల్ “గా ఎంజాయ్ చేస్తున్నారు. స్టైలిష్ స్టార్ తన తనయ తో ఎక్సర్ సైజ్ లు, కీర్తి సురేష్, మెహరీన్ వర్క్ అవుట్స్, రష్మిక తన పెంపుడు కుక్కలతో ఆడుకుంటూ, రకుల్ ప్రీత్ తన తమ్ముడితో ఆటలాడుతూ, పాయల్ రాజ్ పుత్ ఇంటి పనులతో, అదా శర్మ కుకింగ్ లో, సమంత, నిధి అగర్వాల్ ఆన్ లైన్ క్లాసెస్ తో, మంచు కుటుంబం కొత్త వంటలతో ఇలా సెలబ్రిటీస్ తమ కార్యక్రమాలతో లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. లాక్ డౌన్ సమయం ముగిసిన తరువాత షూటింగ్స్ ప్రారంభం అయితే సెలబ్రిటీస్ తమ మూవీ పనులతో బిజీగా మారిపోతారని తెలిసిన విషయమే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: