విశాఖపట్నం దుర్ఘటనపై టాలీవుడ్ నటుల ప్రగాఢ సానుభూతి..!

Tollywood Film Celebrities Express Their Sympathy On Vizag Tragic Accident
Tollywood Film Celebrities Express Their Sympathy On Vizag Tragic Accident

వైజాగ్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ కెమికల్ ఫ్యాక్టరీ నుండి గ్యాస్ లీకవడంతో అక్కడ వున్న ప్రజలు అస్వస్థతకు గురవ్వగా… ఈ సంఘటనలో కొంత మంది ప్రాణాలు కూడా పోయాయి. వీరికి మెరుగైన వైద్యం అందించేందుకు వైద్య సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై అందరూ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రముఖులు కూడా దీనిపై స్పందించి… ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై సినీనటుడు చిరంజీవి స్పందించారు. ‘విశాఖలో విషవాయువు స్టెరిన్ బారినపడి ప్రజలు మరణించటం మనసుని కలచివేసింది. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అస్వస్థతకు గురైన వారందరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. లాక్‌డౌన్‌ అనంతరం తిరిగి పరిశ్రమలు ప్రారంభించే విషయంపై సంబంధిత అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను’ అని ట్వీట్ చేశారు.


విశాఖ గ్యాస్‌ లీక్‌ దుర్ఘటన వార్త తన హృదయాన్ని బాధించిందని మహేశ్ బాబు ట్వీట్ చేశాడు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.


‘నా జీవితంలో చాలా ప్రత్యేకమైన ప్రాంతాల్లో ఒకటైన వైజాగ్‌ను ఈ పరిస్థితుల్లో చూస్తోంటే నా హృదయం పగిలినంత పనైంది. ఈ భయంకర ప్రమాదం నన్ను కలచి వేసింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాను’ అని సినీనటుడు అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.


ఇంకా సినీనటులు రవితేజ, నాని, తమన్నా స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

 

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =