బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ బ్లాక్ బస్టర్ “భరత్ అనే నేను” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన రెండవ తెలుగు మూవీ “వినయ విధేయ రామ ” పరాజయం పాలయ్యింది. ఆ మూవీ తరువాత సూపర్ హిట్ మూవీ”అర్జున్ రెడ్డి” హిందీ రీమేక్ “కబీర్ సింగ్” మూవీ లో కియారా నటించారు. “కబీర్ సింగ్” మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించడంతో హిందీ మూవీస్ లో కియారా అద్వానీ బిజీ హీరోయిన్ గా మారారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాలీవుడ్ లో బిజీగా ఉన్న కియారా అద్వానీ టాలీవుడ్ స్టార్ హీరోల పలు మూవీస్ లో అవకాశాలు అందుకుంటున్నా, ఏ మూవీ ఫైనలైజ్ కాలేదు. లాక్ డౌన్ సమయాన్ని ఎలా స్పెండ్ చేస్తున్నారో ఆమె మాటల్లోనే తెలుసుకొందాం. కియారా మాట్లాడుతూ .. కుటుంబ సభ్యులతో “లూడో”, ” ఉనో” గేమ్స్ ఆడుతున్నానని, తన చిన్నప్పటి సినిమాలు చూస్తున్నానని, కుకింగ్ లో ప్రావీణ్యం సంపాదించడానికి సహకరించిన రెసిపీ లు, వీడియోస్ కు థ్యాంక్స్ అని, కిచిడీ, కొన్ని వెజిటబుల్ కర్రీస్ చేయడం లో ఎక్స్ పర్ట్ అయ్యానని, హాల్వా, కేక్, కుకీస్ వంటివి చేయగలనని చెప్పారు. వీటితోపాటు మరొక ఆసక్తికర విషయాన్ని కియారా చెప్పారు. కోవిడ్ -19 పాజిటివ్ ఉన్న అపరిచితురాలితో కనెక్ట్ అయ్యానని, ఆమె ఒక బ్లాగర్ అని, ఆమె హాస్పిటల్ లో ఉన్నప్పుడు టచ్ లో ఉన్నానని, ఆమె సేఫ్ గా ఉన్నారని చెప్పారు. కోవిడ్ -19 పేషేంట్స్ కు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేలా సెలబ్రిటీస్ ఫోన్ కాల్ చేయడమనే గొప్ప ఐడియా ఇచ్చిన కియారా అద్వానీ ని అభినందిద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: