యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న “శ్రీకారం “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ “RX 100” మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందనున్న యాక్షన్ థ్రిల్లర్ “మహా సముద్రం” మూవీ కి శర్వానంద్ ఓకే చెప్పారు. శర్వానంద్ ఇప్పుడు మరో వైవిధ్య భరిత ప్రేమ కథా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సక్సెస్ ఫుల్ “కార్తికేయ “, “ప్రేమమ్” మూవీస్ ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఒక ప్రేమ కథా చిత్రం రూపొందనుందని, ఈ మూవీ కథ 1910 కాలం నుండి 2021 సంవత్సరం వరకు నడుస్తుందని సమాచారం. దర్శకుడు చందు మొండేటి ప్రస్తుతం “కార్తికేయ ” మూవీ సీక్వెల్ “కార్తికేయ 2” మూవీ స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నారు. ఈమూవీ షూటింగ్ పూర్తి అయిన తరువాత శర్వానంద్ మూవీ ని చందు మొండేటి తెరకెక్కించనున్నారని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: