కొరటాల శివ-చిరు కాంబినేషన్ ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు ప్రస్తుతం బ్రేక్ పడింది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మోహన్ లాల్ హీరో గా మలయాళంలో గత ఏడాది వచ్చిన ‘లూసిఫర్’ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి కూడా విదితమే. సాహో డైరెక్టర్ సుజిత్ తో డైరెక్ట్ చేయించాలని చిరు కూడా ప్లాన్ లో వున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పనిలో సుజిత్ ఉన్నట్లు తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో ‘లూసిఫర్’ సినిమాలో మోహన్ లాల్ కి నమ్మిన బంటుగా జాయేద్ మసూద్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించాడు. ఇక గతంలో ఈ పాత్రలో అల్లు అర్జున్ చేస్తున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అందులో నిజం లేదని తెలిసింది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో నటిస్తున్నాడని వార్తలు ఊపందుకున్నాయి. అయితే ఈ వార్తలలో ఎటువంటి నిజం లేదని తెలుస్తుంది. ఇప్పటికే రెండు చిత్రాలతో బిజీగా ఉన్న సల్మాన్ లూసిఫర్ తెలుగు రీమేక్ లో నటించే అవకాశాలు లేవంటున్నారు. ఇవి కేవలం రూమర్లు మాత్రమే అంటున్నారు. ప్రస్తుతం సల్మాన్ ప్రభుదేవా దర్శకత్వంలో రాధే సినిమా కభీ ఈద్ కభీ దివాళి అనే సినిమాలతో బిజీ గా వున్నాడు.
మరి ఈ రోల్ లో ఎవరని ఎంపిక చేసుకుంటారా అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈలోపు అల్లు అర్జున్ అని, సల్మాన్ అని పలు పేర్లు వినిపిస్తున్నాయి. ఇక వాళ్ళు ప్రకటన ఇచ్చేలోపు ఇంకెన్ని పేర్లు వస్తాయో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: