ఆ హీరోలతో నటించాలని ఉంది..!

లాక్‌డౌన్ టైమ్.. సినీ తారలంతా ఇంట్లో ఖాళీగానే ఉన్నారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. కొంత మంది స్టార్లు ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ నిర్వహిస్తున్నారు.. మరికొంత మంది ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతున్నారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. తాజాగా రాశీ ఖన్నా ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ప్రస్తుతం ఇంటి దగ్గర మంచి పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేస్తున్నాను. నేను ఎప్పుడూ ఆనందంగా ఉండటానికి కారణం నా కుటుంబ సభ్యులు .. స్నేహితులే. ప్రతి విషయాన్ని పాజిటివ్ గా తీసుకోవడం మరో కారణం. తెలుగులో నేను అభిమానించే కథానాయిక సమంత అని చెప్పింది. అల్లు అర్జున్ గురించి ఏమైనా చెప్పండి అని ఒక అభిమాని అడగగానే.. ‘‘ఆయన చుట్టూ ప్రతి ఒక్కరినీ ఎంతో ప్రోత్సహిస్తుంటారు. ఆయన నటన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన పక్కన నటించడం కూడా ఎంతో ఇష్టం’’ అని రాశీ చెప్పుకొచ్చారు. అలాగే, మహేష్ బాబుతో కలిసి పనిచేయాలని తాను వేచిచూస్తున్నానని.. త్వరలోనే తన కోరిక నెరవేరుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. మరి చూద్దాం రాశీ ఖన్నా కోరిక ఎప్పుడు తీరుతుందో.

కాగా ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రాశీఖన్నా. ఆ సినిమాలో తన క్యూట్ నటనతో యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. అయితే ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తాపడినా వరుస అవకాశాలతో దూసుకుపోతూనే వుంది. గతఏడాది ‘వెంకీమామ’.. ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలతో రెండు హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది విజయ్ దేవరకొండతో నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫలితంతో ఓ భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది రాశీ.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 11 =