మెగా స్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఇటీవలే ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే చిరు ఎంట్రీ అయితే లేట్ అయిందేమో కానీ.. ఆయన మాత్రం కరెక్ట్ టైంలోనే ఎంట్రీ ఇచ్చారు. అసలే లాక్ డౌన్. షూటింగ్ లు లేవు. ఇంట్లోనే ఉండాలి. ఇలాంటి టైం సోషల్ మీడియా లోకి ఎంట్రీ ఇచ్చి పలు విషయాలను తన వీడియోల ద్వారా పంచుకుంటున్నారు. కరోనా పై అవగాహనా కల్పించే వీడియోస్ దగ్గర నుండి.. తన వ్యక్తిగత జీవితం వరకూ అన్ని విషయాలను ఎప్పటికప్పుడు తెలియచేస్తూనే ఉన్నారు. ఒకరకంగా యంగ్ హీరోస్ కూడా అంత యాక్టీవ్ గా లేరు. చిరు మాత్రం ప్రతి విషయాన్ని అప్ డేట్ ఇస్తూ.. కొన్నిసార్లు సప్సెన్స్ క్రియేట్ చేస్తూ అభిమానులను ఆనందంలో ముంచెత్తుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే అసలు చిరు సోషల్ మీడియాలోకి రావడానికి కూడా వేరే కారణం ఉందట. నిజానికి తనకు నిర్భయ, దిశ సంఘటనలు జరిగినప్పుడు నేను నా వాయిస్ ను వినిపించాలనుకున్నా…కానీ సరైన ఫ్లాట్ ఫామ్ లేక ఏదో ఒక చిన్న వీడియోలు తీసి రిలీస్ చేయాల్సి వచ్చింది. అప్పుడు రామ్ చరణ్ నాకు చెప్పాడు సోషల్ మీడియా లోకి రమ్మని. అదీకాకుండా నాకు దాని గురించి పెద్దగా అవగాహన కూడా లేదు.. కానీ ఇప్పుడు నేర్చుకుంటున్నా.. ఈ లాక్ డౌన్ లో ఎక్కువ సమయాన్ని సోషల్ మీడియాతోనే గడుపుతున్నా… చాలా ఎంజాయ్ చేస్తున్నా అని చెప్పారు చిరు. మొత్తానికి లేట్ అయినా కరెక్ట్ టైం లోనే ఎంట్రీ ఇచ్చాడు చిరు.
కాగా ప్రస్తుతం చిరు, కొరటాల దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: