మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ లో సస్పెన్స్ థ్రిల్లర్ ‘అంధాదున్’ సినిమా రీమేక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను సైతం పూర్తిచేసుకోగా… షూటింగ్ మొదలు పెడదాం అనుకునేలోపు కరోనా వల్ల బ్రేక్ పడింది. అందులో గుడ్డివాడి పాత్రలో నితిన్ నటించబోతున్నాడు. దీనికోసం నితిన్ ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకుంటున్నాడట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో నితిన్కి జోడిగా ‘గ్యాంగ్ లీడర్’ హీరోయిన్ ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తుంది. అంతేకాదు గ్యాంగ్ లీడర్ లో పద్దతిగా కనిపించిన ప్రియాంక..ఈ సినిమాలో బోల్డ్ సన్నివేశాల్లో నటించడానికి కూడా ఈ భామ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. నిజానికి గ్యాంగ్ లీడర్ సినిమాలో ప్రియాంక అరుళ్ నటనకు.. క్యూట్ లుక్స్ కు చాలా మంది ఫిదా అయ్యారు. చూద్దాం మరి ఆ సినిమాలో అలా కనిపించిన అరుళ్ ఈ సినిమాలో ఎలా కనిపిస్తుందో.. ప్రస్తుతం ప్రియాంక శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘శ్రీకారం’ సినిమాలో నటిస్తుంది.
ఇక నితిన్ వెంకీ అట్లూరితో రంగ్ దే అనే సినిమాని చేస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది.వెంకీ తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రాన్ని రొమేంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కించనున్నాడు. ఈ రెండు సినిమాలు కాకుండా టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నాడు. రంగ్ దే పూర్తవగానే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలని ప్లాన్ లో ఉన్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: