నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్తో సైన్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం షూటింగ్ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించాలని అనుకున్నారు. మరి అది ఎంత వరకూ సాధ్య పడుతుందో చూడాలి. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో మాళవిక నయర్ నటిస్తున్నట్టు కొందరు అభిప్రాయపడుతుండగా వాటిపై ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో నటి, యాంకర్ సునయన సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీస్ తో ఆన్ లైన్ లోనే ముచ్చటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా తను మాళవిక నయర్ తో మాట్లాడగా… అందులో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపింది. ఇక ఈ నేపథ్యంలో…మీరు ప్రభాస్ 21 సినిమాలో నటిస్తున్నారని అంటున్నారని.. వాళ్లే కన్ఫామ్ చేసారని అడుగగా.. దానికి నవ్వుకున్న మాళవిక నయర్.. వాళ్ళే కన్ఫామ్ చేసారు.. వాళ్లే కాస్ట్ చేసేశారా.. అలాటింది లేదని చెప్పింది. ఒక వేళ తీసుకుంటే చాలా మంచిది అని కూడా చెప్పింది. మరి చూద్దాం ఇప్పటికైతే ఈ హీరోయిన్ ను సెలెక్ట్ చేయలేదు… మరి చూద్దాం మాళవికాకు ఏమన్నా ఛాన్స్ వస్తుందేమో.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా మాళవిక నయర్ ప్రస్తుతం విజయ్కుమార్ దర్శకత్వంలో ‘ఒరేయ్.. బుజ్జిగా’ సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ హీరో గా నటిస్తుండగా హెబ్బా పటేల్ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కొండా కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా మర్చి 25న రిలీజ్ అవ్వాలి కానీ కరోనా వల్ల వాయిదా పడింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: