‘అల వైకుంఠపురములో’ చిత్రంతో మెగా కాంపౌండ్లోకి ఎంట్రీ ఇచ్చింది నివేత పెతురాజ్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో..నివేత ఖాతాలో మరో రెండు మెగా మూవీస్ చేరాయని టాలీవుడ్ టాక్. బన్నీ హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప’లో సెకండ్ లీడ్గా ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో నివేత దర్శనమివ్వనుందని ఇప్పటికే వార్తలు వినిపిస్తుండగా.. తాజాగా మరో మెగా కాంపౌండ్ హీరో సినిమాలోనూ నటించే అవకాశాన్ని ఒడిసిపట్టుకుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్లో ‘విరూపాక్ష’ (పరిశీలనలో ఉన్న టైటిల్) పేరుతో ఓ పీరియాడిక్ ఫిల్మ్ తెరకెక్కుతున్న విషయం విదితమే. మొఘలాయిల పరిపాలనా కాలం నాటి కథాంశంతో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో పవన్కి జోడిగా ఇద్దరు కథానాయికలు నటించనున్నారని సమాచారం. ఇప్పటికే రాజకుమారి పాత్ర కోసం శ్రీలంక సుందరి జాక్వలైన్ ఫెర్నాండేజ్ ఎంపికైనట్టు కథనాలు వస్తుండగా.. తాజాగా రెండో నాయిక పాత్ర కోసం నివేత పెతురాజ్ను సెలెక్ట్ చేసిందట చిత్ర బృందం.
త్వరలోనే ‘పుష్ప’, ‘విరూపాక్ష’ చిత్రాల్లో నివేత పెతురాజ్ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: