యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ రానున్న సంగతి తెలిసిందే. ‘ప్రభాస్ 21’గా రూపొందనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనుంది. 2021 ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో ప్రభాస్ ఓ సూపర్ హీరోలా కనిపిస్తాడని సమాచారం. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన వార్తొకటి టాలీవుడ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అదేమిటంటే.. 1985లో వరల్డ్ వైడ్గా హయ్యస్ట్ గ్రాసర్గా నిలచిన హాలీవుడ్ మూవీ ‘బ్యాక్ టు ద ఫ్యూచర్’ స్పూర్తితో ‘ప్రభాస్ 21’ రూపొందనుందని సమాచారం. టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన ‘బ్యాక్ టు ద ఫ్యూచర్’ స్పూర్తితో తెరకెక్కిన బాలీవుడ్ మూవీ ‘యాక్షన్ రీప్లే’(2010) హిందీనాట ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే, అదే ‘బ్యాక్ టు ద ఫ్యూచర్’ స్క్రీన్ప్లే, సీన్స్ ఆధారంగా చేసుకుని రూపొందిన సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ ‘ఆదిత్య 369’(1991), ‘మనం’(2014) తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా.. తమిళ చిత్రం ‘24’(2016) ఓ వర్గం ప్రేక్షకులను అలరించింది. ఈ నేపథ్యంలో… అదే ‘బ్యాక్ టు ద ఫ్యూచర్’ స్ఫూర్తితో పాన్ – వరల్డ్ మూవీగా రూపొందనున్న ‘ప్రభాస్ 21’ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
మరి.. ఈ కథనాల్లో నిజానిజాలేంటో తెలియాలంటే 2022 ప్రథమార్ధం వరకు వేచి చూడాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: