సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస విజయాలతో తన సత్తా చాటుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఖైదీ నెం 150 సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఆ సినిమా తర్వాత ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి సినిమా చేశాడు.. ఇప్పుడు కొరటాలతో ఆచార్య సినిమా చేస్తున్నాడు. అంతే కాదు పలు ప్రాజెక్టులను కూడా లైన్ లో పెడుతున్నాడు మెగా స్టార్. అయితే ఈసారి మాత్రం యంగ్ డైరెక్టర్స్ తో చేయడానికే రెడీ అయ్యాడు చిరు. అంతేకాదు ఇదే విషయంపై కూడా స్పందించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యువ దర్శకులతో పని చేస్తే తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవచ్చని.. ‘నన్ను స్క్రీన్ మీద చూస్తూ పెరిగి డైరెక్టర్స్ అయిన యంగ్ జనరేషన్ కు నన్ను కొత్తగా ప్రజెంట్ చేయాలన్న తపన ఉంటుంది’ అని అన్నారు. అలాగే, తనకు కూడా వాళ్లతో, వాళ్ల కొత్త ఆలోచనలతో పని చేయడం ‘ఇన్స్పైరింగ్ ’ గా ఉంటుందని చిరంజీవి చెప్పారు. అంతే కాదు ‘సాహో’ సుజిత్ తో ‘లూసిఫర్’ చేసే ఆలోచన వుంది. బాబీ, మెహర్ రమేశ్ లతో ఒక్కో సినిమా చేయాలనుకుంటున్నాను. హరీశ్ శంకర్, సుకుమార్, పరశురామ్ లను తన ఇంట్లోనే ఇటీవల కలిశాను. చర్చలు కూడా జరిగాయి’ అని చెప్పారు. మొత్తానికి చిరు తో చేయలేదని ఎవరైతే బాధ పడ్డారో సెకండ్ ఇన్నింగ్స్ లో వారి కోరిక తీరినట్టే.
కాగా ప్రస్తుతం చిరు, కొరటాల దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ కు కరోనా వల్ల బ్రేక్ పడింది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: