టాలీవుడ్ లో ప్రస్తుతం రీమేక్ మూవీస్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్, కోలీవుడ్ మూవీస్ తో పాటు కొరియన్ మూవీస్ కూడా తెలుగు లో రీమేక్ చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. నందిని రెడ్డి దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో రూపొందిన కొరియన్ మూవీ తెలుగు రీమేక్ “ఓ బేబీ” ఘనవిజయం సాధించింది. ఇప్పుడు మరో కొరియన్ మూవీ తెలుగు లో రీమేక్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు, తాటి సునీత నిర్మాతలుగా సుధీర్ వర్మ దర్శకత్వంలో ట్యాలెంటెడ్ హీరోయిన్ రెజీనా ప్రధాన పాత్రలో సూపర్ హిట్ కొరియన్ మూవీ “మిడ్ నైట్ రన్నర్స్ ” తెలుగు భాషలో రీమేక్ కానుంది. నివేత థామస్, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటించనున్నారు. కరోనా ఎఫెక్ట్ క్లియర్ అయినతరువాత ఈ మూవీ తెరకెక్కనుంది. “పవర్”, “పిల్లా నువ్వు లేని జీవితం”, “సుబ్రమణ్యం ఫర్ సేల్” , “అ !”, “ఎవరు” వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో అలరించిన రెజీనా ఈ మూవీ తో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: