`అల వైకుంఠపురములో` ఘనవిజయంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మళ్ళీ సక్సెస్ ట్రాక్లోకి వచ్చేశాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో.. తన లక్కీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో ‘పుష్ప’ అనే యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మికా మందన్న నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్కి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చుతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే.. తొలుత ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం తమిళ నటుడు విజయ్ సేతుపతిని ఎంపిక చేసింది చిత్ర బృందం. అయితే, అనివార్య కారణాలతో విజయ్ తప్పుకోగా.. ఇప్పుడా స్థానంలో శాండల్వుడ్ హీరో ధనంజయ్ వచ్చి చేరినట్టు సమాచారం. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘భైరవగీత’లో కథానాయకుడిగా నటించాడు ధనంజయ్. కాగా, ‘పుష్ప’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనున్న ఈ టాలెంటెడ్ యాక్టర్.. ఏ మేరకు ఆడియన్స్ను అలరించనున్నాడో చూడాలి. త్వరలోనే ‘పుష్ప’లో ధనంజయ్ ఎంట్రీపై క్లారిటీ రానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























