నటసింహ నందమూరి బాలకృష్ణతో అత్యధిక చిత్రాలు చేసిన దర్శకుడిగా ఎ.కోదండరామిరెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో సింహభాగం విజయం సాధించినవే కావడం విశేషం. అలాంటి విజయవంతమైన కలయికలో వచ్చిన ఆఖరి చిత్రం ‘యువరత్న రాణా’. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీలో.. బాలకృష్ణ సరసన హీరా నాయికగా నటించింది. శ్రీహరి, అచ్యుత్, జయప్రకాష్ రెడ్డి, చరణ్రాజ్, చంద్రమోహన్, చలపతిరావు, అన్నపూర్ణ, బాలయ్య, ఎం.ఎస్.నారాయణ, రఘునాథ రెడ్డి, రాళ్ళపల్లి ముఖ్య భూమికలు పోషించగా.. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘మైనే ప్యార్ కియా’తో విశేష గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక భాగ్యశ్రీ కీలక పాత్రలో దర్శనమిచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వేటూరి సుందరరామమూర్తి, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్ తేజ గీత రచనకు.. కోటి వినసొంపైన బాణీలు అందించారు. “మా కళ్యాణసీతని”, “రంపచికం”, “గుమ్మగుమ్మలారా’, “ఎప్పుడు మరి”, “చెంగు జారిపోతాంది”, “ఓ యామిని”.. ఇలా ప్రతీ పాట అభిమానులను అలరించింది. కె.లలితావాణి సమర్పణలో రుగ్వేద క్రియేషన్స్ పతాకంపై కె.మీనాక్షీనాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. 1998 ఏప్రిల్ 17న విడుదలైన ‘యువరత్న రాణా’.. నేటితో 22 ఏళ్ళను పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: