యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో.. ప్రభాస్ ఓ సూపర్ హీరోలా కనిపిస్తాడని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే.. తొలుత ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివరలో సెట్స్ పైకి తీసుకువెళ్ళడానికి ప్లాన్ చేసింది యూనిట్. అయితే, కరోనా ఎఫెక్ట్తో వాయిదా తప్పలేదు. తాజా సమాచారం ప్రకారం.. 2021 ఫిబ్రవరి నుంచి ఈ సినిమా తాలూకు చిత్రీకరణని ప్రారంభిస్తారని తెలిసింది. పాన్ – వరల్డ్ మూవీగా తెరకెక్కనున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో ప్రభాస్కు జోడిగా ఓ బాలీవుడ్ బ్యూటీ నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే నాయికతో పాటు మిగిలిన విషయాలపైనా పూర్తి స్పష్టత రానుంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ప్రభాస్ ఓ పీరియాడికల్ లవ్ స్టొరీ చేస్తున్నాడు. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్లో పూజా హెగ్డే నాయికగా నటిస్తోంది. 2021 ప్రథమార్థంలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: