ఈ ఏడాది ‘దర్బార్’ సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు తమిళ్ సూపర్ స్టార్, తలైవా రజినీ కాంత్. ప్రస్తుతం తను అజిత్తో ‘వీరం’, ‘వేదాళం’, ‘వివేకం’, ‘విశ్వాసం’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన శివ కాంబినేషన్లో సినిమా చేస్తున్నాడు. ఖుష్బూ,మీనా హీరోయిన్స్గా నటిస్తున్న ఈ సినిమాలో…. కీర్తి సురేష్ ముఖ్యపాత్రలో నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా తర్వాత రజినీకాంత్.. కమల్ హాసన్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్లో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను ఆగష్ట్ నుండి ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది. నిజానికి ఈ సినిమాను కమల్ ఏప్రిల్ లోనే ప్రారంభించాలని ప్లాన్ చేసాడు. కానీ లాక్ డౌన్ కారణంగా ఎక్కడికక్కడ షూటింగ్ లు నిలిచిపోయాయి.
ప్రస్తుతం లోకేష్ కానగరాజ్ విజయ్ తో మాస్టర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమా తర్వాత కమల్ రజినీ సినిమాను పట్టాలెక్కించాలని ప్లాన్ చేశాడు. కానీ అది జరగలేదు. ఇక లాక్ డౌన్ పూర్తయిన తర్వాత శివ సినిమా షూటింగ్ ను పూర్తి చేయనున్నారు. అది అయిపోయిన తర్వాత ఆగష్ట్ నుండి కమల్-రజినీ సినిమాను ప్రారంభించనున్నారు. అంతేకాదు ఈ సినిమాలో కమల్ కూడా ఉండే ఛాన్స్ ఉంది అంటున్నారు. మరి చూద్దాం ఇందులో ఎంత నిజముందో..!
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: