కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు అహర్నిశలు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక దానిలో భాగంగానే…ప్రజలు బయటికి రాకుండా చేయడానికి పోలీసులు రాత్రింబవళ్లు కష్టపడి రోడ్లపై డ్యూటీ చేస్తున్నారు. ఇక కుటుంబాలకు దూరంగా ఉంటూ.. ఇంత కష్టపడుతున్న పోలీసులకు సినీనటులతో పాటు పలువురు ప్రముఖులు కృతజ్ఞతలు చెబుతున్నారు. మహేష్ బాబు నిన్న తన ట్విట్టర్ ద్వారా ప్రశంసించగా నేడు మెగా స్టార్ చిరు కూడా వారిని కొనియాడారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇరు తెలుగు రాష్ట్రాల పోలీసుల పని తీరు అద్భుతం. నిద్రాహారాలు కూడా మాని వారు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. నేను హైదరాబాద్ నుంచి స్వయంగా చూస్తున్నాను. వారి పనితీరు వల్ల లాక్డౌన్ విజయవంతమవుతుంది అని చిరంజీవి తెలిపారు. అలా జరగబట్టే కరోనా విజృంభణను చాలా వరకు అదుపులోకి వచ్చింది. అలాగే, ప్రతి ఒక్కరినీ వేడుకుంటున్నాను. ప్రజలంతా పోలీసులకు సహకరించండి. పోలీసులు చేస్తున్న పనికి ఓ పోలీసు బిడ్డగా నేను వారికి సెల్యూట్ చేస్తున్నాను’ అని చిరంజీవి చెప్పారు.
#SalutingCoronaWarriors @TelanganaDGP @TelanganaCOPs #UnitedAgainstCorona pic.twitter.com/9LOFWD9irk
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 10, 2020
కాగా ప్రస్తుతం చిరు, కొరటాల దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: