టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫిమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రిన్స్ అనే మాటకు కరెక్ట్ గా సూటయ్యే పర్సనాలిటీ మహేష్ ది. ‘రాజకుమారుడు’ సినిమాతో అమ్మాయిల కలల రాకుమారుడిగా అయ్యాడు. ఇక సెలబ్రిటీస్ లో కూడా చాలా మంది మహేష్ కు ఫ్యాన్స్ వున్నారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఆ విషయంమనం చూసాం. ఇక ఇప్పుడు తాజాగా మరో సెలబ్రిటీకూడా మహేష్ అంటే తనకు క్రష్ అంటుంది. ఆమె ఎవరో కాదు. హంసా నందిని.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
విమెన్ ఫేమ్ సునయన లాక్ డౌన్ కారణంగా సోషల్ మీడియా ద్వారానే సెలెబ్రిటీలతో చిట్ చాట్ చేస్తుంది. దీనిలో భాగంగానే హంసా నందినితో కూడా తను ముచ్చటించింది. ఈ నేపథ్యంలో మీ సెలబ్రిటీ క్రష్ ఎవరని అడుగగా… నిజం చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీ నుండి లేదు… ఒకవేళ తెలుగు ఇండస్ట్రీ లో చెప్పాలంటే మాత్రం మహేష్ బాబు. నేను అనుమానాస్పదం సినిమా చేస్తున్నప్పుడు పోకిరి వచ్చింది. ఇక థియేటర్ లో ఈ సినిమా చూస్తున్నప్పుడు మహేష్ బాబును చూసి షాకయ్యా.. చాలా బావున్నాడు అని అనుకున్నాను అని తెలిపింది.
కాగా వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘అనుమానస్పదం’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా పరిచయమైంది హంసా నందిని. ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది కానీ హీరోయిన్ గా మాత్రం నిలదొక్కుకోలేకపోయింది. అంతేకాదు పలు స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించింది ఈ భామ.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: