మొత్తానికి చిరు ఈమధ్య ఒకదాని తర్వాత ఒకటి నిజాలు మొత్తం బయటకు చెప్పేస్తున్నారు. పిట్టకథ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా టైటిల్ ను చెప్పి నోరు జారారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఉంటాడా..?చరణ్ ఉంటాడా? అన్న విషయంలో కూడా క్లారిటీ ఇచ్చాడు. ఈ విషయంపై చిరుని అడుగగా… అసలు మహేష్ పేరు ఎలా వచ్చిందో తెలియట్లేదు…మొదటి నుండి ఈ సినిమాలో ఓ పాత్రకు చరణ్ అయితే బావుంటదని కొరటాల శివకు మొదటినుండి ఉంది.. అయితే చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ తో బిజీ గా వున్నాడు… మొదటి నుండి అనుమానం ఉంది…రాజమౌళి, కొరటాల ఒక అండర్ స్టాండింగ్ కు వస్తే… ఈ సినిమాలో చరణ్ ఉండొచ్చు… లేకపోతే కుదరకపోవచ్చు అని చెప్పి క్లారిటీ ఇచ్చాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి త్రిష ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో కూడా తెలియచేసారు. నిజానికి ముందు ఈసినిమాలో త్రిషను తీసుకున్నారు. ఆ తరువాత ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఇక ఇదే విషయాన్ని చిరుని అడుగగా… “ఈ విషయాన్ని గురించి నేను యూనిట్ సభ్యులతో మాట్లాడాను. ఎవరితోనూ ఆమెకి ఎలాంటి గొడవలేదు. ఏ విషయంపై ఎవరితోను విభేదాలు తలెత్తలేదు. మణిరత్నం సినిమా కోసం ఆమె ఎక్కువ డేట్లు కేటాయించవలసి వచ్చింది. అందువల్లనే ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. అంతేగానీ ఇందులో ఎలాంటి వివాదాస్పదమైన అంశం లేదు” అని చెప్పుకొచ్చారు.
కాగా ప్రస్తుతం చిరు, కొరటాల దర్శకత్వంలో ‘ఆచార్య’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జోడి జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: