సినీ రంగానికి చెందిన రోజువారి కార్మికులు లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వల్ల సినీ కార్మికులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా…ఇప్పటికే సెలబ్రిటీస్ ముందుకు వచ్చి తమ వంతుగా తాము ఆర్థిక సాయం అందిస్తున్నారు. వారిని ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది హీరోలు సినీ కార్మికులతో పాటు…ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల సహాయ నిధికి విరాళాలు అందించారు. మరోవైపు టాలీవుడ్ లో చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్-కరోనా క్రైసిస్ పేరిట విరాళాల సేకరణ జరుగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈ విషయంలో కూడా హీరోయిన్లపై కామెంట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. హీరోలు మాత్రమే విరాళాలు చేస్తున్నారు… హీరోయిన్స్ కు ఏమైంది… హీరోయిన్స్ కు సాయం చేయాల్సిన అవసరం లేదా..? అన్న విమర్శలు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు తమ వంతు సాయం చేయడానికి ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఓ 50 కుటుంబాలకు రెండు వేల చొప్పున లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తున్నట్టు తెలిపింది. ఇప్పుడు మరో హీరోయిన్ ముందుకొచ్చి ఆర్ధిక సాయాన్ని అందించింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు స్టార్ హీరోయిన్ నయనతార. ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా ఆమె రూ.20 లక్షల విరాళం ప్రకటించింది. మరి నిజంగానే హీరోలు కోట్లకు కోట్లు కుమ్మరిస్తుంటే.. హీరోయిన్స్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం బాధాకరం. వీరి బాటలోనే మరింత మంది హీరోయిన్లు కు ముందుకు వచ్చి సాయం చేస్తే బావుంటది..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: