‘సైరా నరసింహారెడ్డి’ వంటి పేట్రియాటిక్ డ్రామా తరువాత మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్లో చిరుకి జోడిగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్ర పోషించనున్నాడని టాక్. కాగా రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని… తొలుత ఆగస్టులో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే, ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది వేసవికి వాయిదా పడినట్టు టాలీవుడ్ సర్కిల్స్లో వార్తలు వినిపిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ఇందులో కీలక పాత్ర పోషించనున్న చరణ్ ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’తో బిజీగా ఉండడంతో పాటు, కరోనా వైరస్ కారణంగా `ఆచార్య` చిత్రీకరణని కూడా తాత్కాలికంగా నిలిపివేయడంతో… ముందు అనుకున్నట్టుగా ఆగస్టులో విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే… వచ్చే ఏడాది వేసవికి వాయిదా వేస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందని, దీనికి చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వినికిడి. కాగా, రానున్న రోజుల్లో ‘ఆచార్య’ విడుదల తేదీకి సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.
`ఆచార్య`కి మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలు అందిస్తున్నాడు. చాలా కాలం తరువాత చిరు, మణి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఆడియో పై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: