యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ‘జిల్’ దర్శకుడు రాధాకృష్ణ కాంబినేషన్లో ఓ పీరియాడిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘రాధే శ్యామ్’, `ఓ డియర్` అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్న ఈ చిత్రంలో ప్రభాస్కి జోడీగా స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే నటిస్తోంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు, బాలీవుడ్ యాక్ట్రస్ భాగ్యశ్రీ కీలక పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. ఇదిలా ఉంటే… ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో ప్రభాస్ గెటప్స్ కి సంబంధించి ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అదేమిటంటే… ఇందులో ప్రభాస్ రెండు డిఫరెంట్ గెటప్స్లో దర్శనమివ్వనున్నాడని టాక్. వాటిలో ఒకటి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో సాగే లవర్ బాయ్ గెటప్ కాగా… మరొకటి ప్రస్తుత కాలానికి సంబంధించిన స్టైలిష్ లుక్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా చిత్రీకరణ విషయానికొస్తే… ఇటలీ నేపథ్యంలో సాగే కథ కావడం వలన ఇటీవల జార్జియా పరిసర ప్రాంతాల్లో దాదాపు 30 శాతం చిత్రీకరణను పూర్తి చేశారు. అనంతరం తదుపరి షెడ్యూల్లో భాగంగా ఆసుపత్రికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయాలని భావించారు. అయితే కరోనా వైరస్ కారణంగా ఇటలీ వెళ్ళే అవకాశం లేకపోవడంతో… ఇప్పుడు ఆ సన్నివేశాలను హైదరాబాద్లోనే చిత్రీకరించేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్లో ఆసుపత్రికి సంబంధించిన ఓ భారీ సెట్ను తీర్చిదిద్దనుందట యూనిట్. ఇప్పటికే ఇదే స్టూడియోలో రెండు, మూడు సెట్స్ వేసి షూటింగ్ను పూర్తి చేసిన యూనిట్… ఇప్పుడు అదే తరహాలో ఆసుపత్రి సన్నివేశాలను కూడా షూట్ చేయాలని అనుకుంటోంది.
కాగా, ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థలు గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ… దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రచారం సాగుతోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: