ఇంటినుండి పని చేయడం అంత ఈజీ కాదు అంటున్నాడు రాజమౌళి తనయుడు కార్తికేయ. అసలు సంగతేంటంటే…కరోనా వల్ల చాలా మంది ఇంటి నుండే పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వర్క్ కేవలం ఆఫీస్ కు వెళ్లే వాళ్ళు మాత్రమే కాదు సినిమా వాళ్ళు కూడా ఇంటి నుండే తమ ఇంటి నుండే పనులను చక్కబెడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే రాజమౌళి ఇప్పటికే ఇంటిలో వుండే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాడు. ఇక నిన్న చరణ్ పుట్టిన రోజు సందర్భంగా చెర్రీ ని ఇంట్రడ్యూస్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియో అయితే అదిరిపోయింది. రాంచరణ్ యాక్షన్ , ఎన్టీఆర్ డైలాగ్స్ తో గూస్ బంప్స్ వచ్చాయి. అయితే క్రమంలోనే కార్తికేయ తన ట్విట్టర్ ద్వారా తన టీమ్ ను ప్రశంసించాడు. ఈ వీడియో కోసం 48 గంటలు పనిచేస్తూనే ఉన్నారు.. లాక్ డౌన్ టైం లో ఇంటిలోనుండి పని చేయడం అంత ఈజీ కాదు… కానీ ఇలాంటి టైములో కూడా ఇంత ఎఫర్ట్ పెట్టినందుకుగానూ ప్రశంసించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
In the period of lockdown,
I’d want to appreciate the commendable efforts put in by our team. Working from home/remotely is not easy, but our team pulled this off by working continuously since past 48 hours! #BheemforRamaraju 🙌👏🏻— S S Karthikeya (@ssk1122) March 28, 2020
మొత్తానికి ఈ లాక్ డౌన్ వేళ ఆర్ఆర్ఆర్ టీమ్ వరుస అప్ డేట్స్ తో ఎన్టీఆర్, మెగా అభిమానులకు ఊరటనిస్తున్నారు. దాదాపు ఏడాది నుండి ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నారాజమౌళి మాత్రం సినిమాకు సంబంధించిన ఏ విషయాన్నీ బయటకు రానీయకుండా ఆడియన్స్ని ఊరిస్తూ వచ్చాడు. అయితే ఉగాది పండుగ సందర్భంగా ఈ టైటిల్ ను రిలీజ్ చేశారు. టైటిల్ మోషన్ పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: