తెలుగునాట చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాల్లో `మాయాబజార్` ఒకటి. యన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, యస్.వి.రంగారావు, సావిత్రి, సంధ్య, గుమ్మడి, ముక్కామల, సి.యస్.ఆర్., రమణారెడ్డి, రేలంగి, ఛాయాదేవి, సూర్యకాంతం, ఋష్యేంద్రమణి వంటి దిగ్గజ నటుల మేలికలయికలో లెజెండరీ డైరెక్టర్ కేవీ రెడ్డి రూపొందించిన ఈ చిత్రాన్ని బి.నాగిరెడ్డి, చక్రపాణి సంయుక్తంగా నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పింగళి నాగేంద్రరావు గీత రచన చేయగా… ఘంటసాల వెంకటేశ్వరరావు, యస్.రాజేశ్వరరావు స్వరాలు సమకూర్చారు. “నీవేనా నను తలచినది”, “చూపులు కలసిన శుభవేళ”, “లాహిరి లాహిరి లాహిరిలో”, “నీకోసమేనే జీవించునది”, “వివాహ భోజనంబు”, “అహనా పెళ్ళి అంట”, “సుందరి నీవంటి”, … ఇలా పాటలన్నీ ఈనాటికీ నిత్యనూతనంగానే ఉంటాయి. 1957 మార్చి 27న విడుదలై అఖండ విజయాన్ని సాధించిన ‘మాయాబజార్’… నేటితో 63 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: