చిత్ర పరిశ్రమకి ఎందరో సంగీత దర్శకులు వస్తుంటారు… పోతుంటారు. అయితే, కొందరు మాత్రమే తమదైన బాణీలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి సంగీత దర్శకుల్లో అనూప్ రూబెన్స్ ఒకరు. తొలి చిత్రం `జై`(2004) నుంచి గత చిత్రం `విశ్వామిత్ర`(2019) వరకు అనూప్ది ఇదే బాణి. జయాపజయాలను పక్కన పెడితే… తన స్వరకల్పనలో రూపొందిన పలు పాటలకు ప్రాణప్రతిష్ఠ చేశాడీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆది సాయికుమార్ డెబ్యూ ఫిల్మ్ ‘ప్రేమకావాలి’(2011)తో తొలి విజయాన్ని అందుకున్న అనూప్… అనంతరం నితిన్ కమ్ బ్యాక్ మూవీ ‘ఇష్క్’(2012), ‘గుండె జారి గల్లంతయ్యిందే’(2013), అక్కినేని ఫ్యామిలీ మూవీ ‘మనం’(2014), ‘టెంపర్’(2015), ‘సోగ్గాడే చిన్ని నాయనా’(2016), ‘నేనే రాజు నేనే మంత్రి’(2017) వంటి సినిమాలతో ఏడాదికో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
అలాంటి అనూప్ స్వరాలు సమకూర్చిన తొలి చిత్రం ‘జై’ విడుదలై నేటి(మార్చి 25)కి సరిగ్గా పదహారేళ్ళు. అంటే… సంగీత దర్శకుడిగా అనూప్ కెరీర్ మొదలై ఇవాళ్టితో పదహారేళ్ళు పూర్తవుతోందన్న మాట.
కాగా, అనూప్ సంగీతమందించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’, ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రాలు విడుదలకు సిధ్ధంగా ఉన్నాయి. ఆడియో పరంగా సంచలనం సృష్టిస్తున్న ఈ రెండు సినిమాలు… అనూప్ కెరీర్కు మరింత కలసి రావాలని ఆశిద్దాం. అలాగే, మున్ముందు మరిన్ని విజయాలతో ముందుకు సాగాలని ఆకాంక్షిద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: