గత చిత్రం `డిస్కో రాజా`లో ముచ్చటగా ముగ్గురు కథానాయికలతో సందడి చేశాడు మాస్ మహారాజా రవితేజ. పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, తాన్యా హోప్.. ఇలా ఇదివరకు తను జోడీకట్టని భామలతోనే ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేశాడాయన. కట్ చేస్తే.. రాబోయే చిత్రాల్లో మాత్రం అందుకు భిన్నంగా ఆల్రెడీ తను జట్టుకట్టిన నాయికలతోనే `రిపీట్` రొమాన్స్ చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు రవితేజ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే.. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న `క్రాక్`లో `బలుపు` భామ శ్రుతి హాసన్ తో ఆడిపాడుతున్న రవితేజ.. ఆపై రమేష్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న చిత్రంలో తన `నేల టిక్కెట్టు` జోడీ మాళవికా శర్మతో మరోసారి రొమాన్స్ చేయనున్నాడట. ఇందులో మరో నాయికగా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఆమెతో మాత్రం రవితేజ కలసి నటించడం ఇదే తొలిసారి. ఇక త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కనున్న హిలేరియస్ ఎంటర్ టైనర్ లో `బెంగాల్ టైగర్` బ్యూటీ తమన్నాతో చిందేయనున్నాడు మాస్ మహారాజా.
మొత్తమ్మీద.. రాబోయే చిత్రాల్లో రవితేజ రొమాన్స్ `రిపీట్ మోడ్`లోనే సాగనుందన్నమాట. మరి.. ఈ మూడు సినిమాలతోనూ రవితేజ విజయాలు అందుకుంటాడేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: