ఈ ఏడాది సంక్రాంతికి నాలుగు చిత్రాలు సందడి చేయగా… వాటిలో రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలో.. రాబోయే దసరా సీజన్ పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ విజయదశమి బరిలో దిగుతున్నట్లు తెలిసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది అక్టోబర్ 25న విజయదశమి వస్తుంది. ఆ రోజు ఆదివారం కాబట్టి.. దసరా సెలవుల్లో కీలకమైన అక్టోబర్ 16, అక్టోబర్ 23 (శుక్రవారాలు)న ఆ సీజన్ చిత్రాలు సందడి చేయనున్నాయి. ఈ నేపథ్యంలో… ఇప్పటికే కన్నడ స్టార్ యశ్ నటిస్తున్న పాన్ – ఇండియా ఫిల్మ్ `కేజీఎఫ్ – ఛాప్టర్ 2` (`కేజీఎఫ్` సీక్వెల్)కి అక్టోబర్ 23ని రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేశారు.
కాగా, ఇదే సీజన్ లో మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ మూవీ `ఆచార్య` కూడా విడుదల కానుందని సమాచారం. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఆగస్టులో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా.. కొన్ని అనివార్య కారణాల వల్ల అక్టోబర్ లో విడుదల చేయాలని భావిస్తోందట యూనిట్. ఇక ఇదే సీజన్ లో సూపర్ స్టార్ రజినీకాంత్, `శౌర్యం` శివ కాంబినేషన్ లో రూపొందుతున్న తమిళ చిత్రం `అణ్ణాత్త` (తెలుగు టైటిల్ ఫిక్స్ కాలేదు) కూడా విడుదల కానుందని సమాచారం.
మరి.. ఈ మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఏయే చిత్రాలు దసరా సీజన్ లో సందడి చేస్తాయో తెలియాలంటే మరికొంతకాలం వేచిచూడాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: