కరోనా ఎఫెక్ట్ కు పలు రాష్ట్రాల్లో ఇప్పటికే కొన్ని థియేటర్స్ మూసివేసిన సంగతి తెలిసిందే. ఇక్కడా కూడా జనాలు థియేటర్స్ కు వెళ్లకపోవడంతో.. చాలా థియేటర్స్ వెల వెల బోతున్నాయి. ఇక చేసేది లేక రిలీజ్ కావాల్సిన సినిమాలను కూడా వాయిదా వేసుకుంటున్నారు పలు సినిమాల దర్శక నిర్మాతలు. ఇప్పటికే ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్వకత్వంలో నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘వి’ సినిమాను వాయిదా వేశారు. నిజానికి ఈ సినిమా ఉగాదికి అంటే ఈ నెల 25న(మార్చి25) విడుదల చేయాల్సి ఉంది. కానీ కరోనా వల్ల సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తూ… త్వరలోనే మరో విడుదల తేదీని రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు మరో సినిమా కూడా తమ రిలీజ్ డేట్ ను మార్చుకుంది. ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్ జంటగా “హాథీ మేరే సాథీ ” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ‘అరణ్య’, తమిళ్లో కదన్ పేరుతో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా ఏప్రిల్ 2 న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ ను కూడా కొద్ది రోజులు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
Because health and safety comes above everything!🙏🏻
Hope to see you guys soon at the theatres. Till then, stay safe! #HaathiMereSaathi #Aranya #Kaadan #ErosNow @RanaDaggubati #PrabuSolomon @TheVishnuVishal @PulkitSamrat @ShriyaP @zyhssn @ErosIntlPlc #SaveTheElephant🐘#Haathi pic.twitter.com/SsgLE1Blga
— Eros Now (@ErosNow) March 16, 2020
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: