గత ఏడాది `చిత్రలహరి`, `ప్రతి రోజూ పండగే` రూపంలొ రెండు వరుస విజయాలు అందుకున్నాడు `సుప్రీమ్` హీరో సాయితేజ్. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న `సోలో బ్రతుకే సో బెటర్`తో ఈ మెగా కాంపౌండ్ హీరో బిజీగా ఉన్నాడు. నూతన దర్శకుడు సుబ్బు రూపొందిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా, ఈ చిత్రం రిలీజయ్యాక `ప్రస్థానం` దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్ లో తన నెక్స్ట్ వెంచర్ ని పట్టాలెక్కించనున్నాడు సాయితేజ్. ఇందులో సాయితేజ్ కి జంటగా నివేదా పెతురాజ్ నటిస్తుందని సమాచారం. ఇప్పటికే ఈ మేరకు చర్చలు జరిగాయని, త్వరలోనే నివేదా ఎంట్రీపై క్లారిటీ వస్తుందని టాక్.
ఇదివరకు సాయితేజ్, నివేదా `చిత్రలహరి`లో కలసి నటించారు. అయితే, అందులో నివేదా కథానాయికగా కాకుండా ఓ కీలక పాత్రలో దర్శనమిచ్చింది. ఈ సారి జోడీగా ఏ మేరకు రంజింపజేస్తారో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: