పోయినేడాది `రాక్షసుడు`తో అలరించిన యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్… ప్రస్తుతం `కందిరీగ` ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు. `ఇస్మార్ట్ శంకర్` భామ నభా నటేష్, `అజ్ఞాతవాసి` భామ అను ఇమ్మాన్యుయేల్ నాయికలుగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే.. మెరుపు వేగంతో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి.. షూటింగ్ పార్ట్ దాదాపు తుది దశకు చేరుకుందని సమాచారం. అంతేకాదు.. వేసవి కానుకగా ఏప్రిల్ 24న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోందట. త్వరలోనే రిలీజ్ డేట్ పై క్లారిటీ వస్తుంది.
`రాక్షసుడు` తరువాత వస్తున్న ఈ చిత్రంతోనూ సాయిశ్రీనివాస్.. మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: