హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న బహుభాషా చిత్రం ‘నిశ్శబ్దం’. భాగమతి సినిమా తర్వాత అనుష్క చేస్తున్న సినిమా.. అందులోనూ మూగ పాత్రలో చేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. ఇక దీనికితోడు మొదటినుండి ఈ సినిమాకు మంచి బజ్ ఏ ఉంది. పోస్టర్లు, టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచేశారు. ఇక వచ్చే నెల 2వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో జోరు పెంచారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి ట్రయిలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. న్యాచురల్ స్టార్ నాని తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. తమిళ్ లో జయం రవి, హిందీలో మజోజ్ భాజ్ పాయ్ రిలీజ్ చేశారు. ఇక ట్రయిలర్ తో ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు చిత్రబృందం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Here’s the #NishabdhamTrailer
Our sweetest Sweety in a edge of the seat thriller. Best wishes to the entire team 😊https://t.co/h6Lep3lbW1#Anushka @ActorMadhavan @yoursanjali @actorsubbaraju @hemantmadhukar @konavenkat99 @vivekkuchibotla @peoplemediafcy @GopiSundarOffl— Nani (@NameisNani) March 6, 2020
తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో ‘నిశ్శబ్దం’ టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది చిత్రయూనిట్.
కాగా ఈ సినిమాలో మాధవన్, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్సన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, కోన వెంకట్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: