పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లోనే తొలిసారిగా ఓ పిరియాడిక్ ఫిల్మ్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కి జోడీగా జాక్వలైన్ ఫెర్నాండెజ్, ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. స్వరవాణి కీరవాణి బాణీలు సమకూర్చుతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన తొలి షెడ్యూల్ పూర్తయింది. కాగా, మలి షెడ్యూల్ ని ఈ నెల 8 నుంచి హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో తీర్చిదిద్దిన ప్రత్యేక సెట్ లో ప్రారంభించనున్నారు. ఈ తాజా షెడ్యూల్ లో పవన్ పై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని సమాచారం. మొఘలాయిల పరిపాలనా కాలం నాటి వాతావరణంతో `పవర్ స్టార్ 27` తెరకెక్కుతోంది. కోహినూర్ వజ్రం చుట్టూ తిరిగే కథతో రూపొందుతున్న ఈ సినిమాలో రాబిన్ హుడ్ తరహా పాత్రని పవన్ పోషిస్తున్నట్లు టాక్.
కాగా, ఈ ఏడాది దసరాకి లేదా వచ్చే సంవత్సరం సంక్రాంతికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజయ్యే అవకాశముంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: