వరుస విజయాలతో ముందుకు సాగుతున్నాడు దర్శకుడు కొరటాల శివ. `మిర్చి`, `శ్రీమంతుడు`, `జనతా గ్యారేజ్`, `భరత్ అనే నేను`… ఇలా నాలుగు విజయవంతమైన చిత్రాలను అందించిన కొరటాల.. ప్రస్తుతం తన ఐదో చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో `ఆచార్య` పేరుతో రూపొందిస్తున్నాడు. ఆగస్టులో ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కానుంది. ఆపై ఆరో చిత్రాన్ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో తెరకెక్కించడానికి శివ సన్నాహాలు చేస్తున్నాడు. అంతేకాదు.. కొరటాల శివ రూపొందించబోయే 7వ చిత్రం కూడా ఇప్పటికే సెట్ అయిందట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తన తొలి చిత్ర కథానాయకుడు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో ఈ భారీ బడ్జెట్ మూవీ ఉంటుందట. ప్రస్తుతం ప్రభాస్.. `జిల్` రాధాకృష్ణ సినిమాతో బిజీగా ఉన్నాడు. అది తన 20వ సినిమా. అదయ్యాక `మహానటి` ఫేమ్ నాగ్ అశ్విన్ తో తన 21వ చిత్రం చేయనున్నాడు `డార్లింగ్`. ఆపై 22వ సినిమాని తన లక్కీ డైరెక్టర్ కొరటాల శివతో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్నమాట. త్వరలోనే ఈ `మిర్చి` కాంబినేషన్ మూవీపై మరింత స్పష్టత వస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: