రామాయణాన్ని తెలుగులో ఎందరో తమదైన రీతిలో రచించారు. అందులో మొల్ల రామాయణం సైతం ప్రాచూర్యం పొందింది. ఆ కథతోనే వెండితెరపై ఆవిష్కరించబడిన చిత్రం `కథానాయిక మొల్ల`. కళాభినేత్రి వాణిశ్రీ టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమాని ప్రముఖ హాస్య నటుడు బి. పద్మనాభం స్వీయదర్శకత్వంలో తెరకెక్కించారు. ప్రముఖ సినిమా జర్నలిస్ట్ ఇంటూరి వెంకటేశ్వరరావు రచించన `కుమ్మరి మొల్ల` నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు పద్మనాభం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో గుమ్మడి, గీతాంజలి, జ్యోతిలక్ష్మి, త్యాగరాజు, సత్యనారాయణతో పాటు పద్మనాభం కూడా ఓ ముఖ్య భూమిక పోషించారు. హరనాథ్ అతిథి పాత్రలో దర్శనమిచ్చారు. ఎస్పీ కోదండపాణి స్వరసారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. మరీ ముఖ్యంగా `జగమే రామమయం` ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంది. 1970కి గానూ `ఉత్తమ చిత్రం`గా `నంది` పురస్కారాన్ని అందుకున్న `కథానాయిక మొల్ల`.. నేటితో (విడుదల తేది: 1970 మార్చి 5) 50 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: