మెగాస్టార్ చిరంజీవి, సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సోషల్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలు అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమాకి `ఆచార్య` అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు గత కొంతకాలంగా కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ టైటిల్ ని అనుకోకుండా ప్రకటించేశారు చిరు. ఆ వివరాల్లోకి వెళితే… ఆదివారం జరిగిన `ఓ పిట్టకథ` వేడుకకు చిరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తన ప్రసంగంలో భాగంగా… తన కొత్త చిత్రం వివరాలు చెపుతూ `ఆచార్య`గా టైటిల్ ని అనౌన్స్ చేశారాయన. అంతేకాదు.. ఈ సినిమా పేరును ప్రత్యేకంగా ప్రకటించాలని అనుకున్నామని, కానీ ఇలాంటి మంచి విషయాలు దాచినా దాగవని… అనుకోకుండా బయటికి వెల్లడించేశానని మెగాస్టార్ అన్నారు.
కాగా, `ఆచార్య` ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: