`మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు` (2015)తో తెలుగునాట స్వరకర్తగా తొలి అడుగేశాడు టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్. ఆపై `భలే భలే మగాడివోయ్`, `ఊపిరి`, `నిన్ను కోరి`, `గీత గోవిందం`, `మజిలీ` తదితర చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం `నిశ్శబ్దం`, `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్` చిత్రాలకి బాణీలు అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే.. తాజాగా గోపీసుందర్ ఖాతాలో ఓ భారీ బడ్జెట్ మూవీ చేరిందని తెలిసింది. ఆ వివరాల్లోకి వెళితే… సూపర్ స్టార్ మహేష్ బాబు, టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్నట్లు కథనాలు వస్తున్న విషయం విదితమే. జూలై నుంచి పట్టాలెక్కనున్న ఈ క్రేజీ వెంచర్ కి గోపీసుందర్ సంగీతమందిస్తాడని ప్రచారం సాగుతోంది. త్వరలోనే గోపీ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. కాగా, ఇదివరకు మహేష్ నటించిన `బ్రహ్మోత్సవం` చిత్రానికి గోపీసుందర్ నేపథ్య సంగీతమందించాడు. అలాగే పరశురామ్ గత చిత్రం `గీత గోవిందం` ఘనవిజయంలో గోపీ ముఖ్య భూమిక పోషించాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: