మహానటుడు యన్.టి.రామారావును వెండితెరకు పరిచయం చేసిన ఘనత దిగ్గజ దర్శకులు యల్.వి.ప్రసాద్ ది. యన్టీఆర్ తొలిచిత్రం ‘మనదేశం’(1949)తో మొదలైన వీరి ప్రయాణం… ‘అప్పు చేసి పప్పుకూడు’(1959) వరకు సాగింది. అలా… వీరి కలయికలో వచ్చిన పలు విజయవంతమైన చిత్రాల్లో ‘పెళ్ళి చేసి చూడు’ ఒకటి. యన్.టి.రామారావు, జి.వరలక్ష్మి నాయకానాయికలుగా నటించగా… సావిత్రి, యస్.వి.రంగారావు, యండమూరి జోగారావు, డా.శివరామకృష్ణయ్య, దొరస్వామి, చదలవాడ, పద్మనాభం, సూర్యకాంతం, పుష్పలత తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. అంతేకాదు… దర్శకులు యల్.వి.ప్రసాద్ అతిథి పాత్రలో మెరిసారు కూడా. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో ‘కళ్యాణం పన్నిపార్’ అనే పేరుతో ఏకకాలంలో చిత్రీకరించారు. యల్.వి.ప్రసాద్కు తమిళంలో ఇదే తొలిచిత్రం కావడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పింగళి నాగేంద్రరావు, ఉటుకూరి సత్యనారాయణ గీత రచన చేయగా… దిగ్గజ గాయకులు, సంగీత దర్శకులు ఘంటసాల వెంకటేశ్వరరావు స్వరకల్పన చేసారు. వాటిలో “పెళ్ళి చేసుకొని” అనే పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఆలూరి చక్రపాణి అందించిన కథకు పింగళి నాగేంద్రరావు మాటలు అందించారు. విజయా ప్రొడక్షన్స్ పతాకంపై బి.నాగిరెడ్డి, ఆలూరి చక్రపాణి నిర్మించిన ఈ హాస్యభరిత చిత్రం ఆబాలగోపాలాన్ని ఎంతగానో అలరించింది. 1952 ఫిబ్రవరి 29న (లీప్ ఇయర్) విడుదలై అఖండ విజయం సాధించిన ‘పెళ్ళి చేసి చూడు’… నేటితో 68 వసంతాలను పూర్తి చేసుకుంది. అంటే 17 లీపు సంవత్సరాలు పూర్తయ్యాయన్నమాట.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: