కమలహాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో “భారతీయుడు-2” అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక గత వారం పెద్ద ప్రమాదం చోటుచేసుకున్న సంగతి కూడా తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ నేపథ్యంలో..150 ఫీట్స్ ఎత్తు నుంచి క్రేన్ పడిపోవడంతో అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు… అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ… ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్రన్ ఈ ప్రమాదంలో మరణించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శంకర్ కు కూడా తీవ్ర గాయాలవ్వడంతో అతడు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రమాదం జరిగిన ఇన్ని రోజులకు తొలిసారి ఈయన ఈ ఘటనపై స్పందించి ట్వీట్ చేశారు. ఆ రోజు జరిగిన సంఘటన ఇప్పటికీ తన కళ్లలోనే ఉందని.. తన అసిస్టెంట్ డైరెక్టర్, క్రూ చనిపోవడం చాలా భాదగా ఉందని.. అప్పటినుండి నిద్రలేని రాత్రులు గడుపుతున్నా అని ట్వీట్ లో పేర్కొన్నాడు. అంతేకాదు… ఆ రోజు ఆ క్రేన్ తనపై పడినా బాగుండేదని సంచలన పోస్ట్ చేసాడు దర్శకుడు శంకర్.. ఇప్పుడు ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.
It is with utmost grief, I’m tweeting.Since the tragic incident,I’ve been in a state of shock & having sleepless nights on the loss of my AD & crew.Having missed the crane by a whisker,I feel it would’ve been better if it was on me. Heartfelt condolences & prayers to the families
— Shankar Shanmugham (@shankarshanmugh) February 26, 2020
కాగా శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్, సిద్ధార్ధ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: