బ్లాక్ బస్టర్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నిర్మాణ సంస్థల్లో వైజయంతీ మూవీస్ ఒకటి. దాదాపు అగ్ర కథానాయకులందరితోనూ ఈ సంస్థ సినిమాలు చేసింది. తొలి తరంలో యన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు… రెండో తరంలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్… ఈ సంస్థలో చిత్రాలు చేశారు. ఇక ఈ తరంలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, యన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్స్ తోనూ వైజయంతీ మూవీస్ క్రేజీ ప్రాజెక్ట్స్ నిర్మించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే, పదిహేడేళ్ళుగా కథానాయకుడిగా రాణిస్తున్న ప్రభాస్ తో ఇప్పటివరకు ఒక్క చిత్రం కూడా చేయలేదు. ఎట్టకేలకు ఆ ముచ్చట `మహానటి` ఫేమ్ నాగ్ అశ్విన్ రూపొందించనున్న భారీ బడ్జెట్ మూవీతో తీరనుంది. ఈ ఏడాది చివరలో పట్టాలెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2021 చివరలో తెరపైకి రానుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు కథానాయకుడిగా సి. అశ్వనీదత్ నిర్మించిన ఒకే ఒక చిత్రం `అడవి సింహాలు` (కృష్ణ మరో కథానాయకుడు) అప్పట్లో మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో… ప్రభాస్ తోనూ ఆ పరంపర కొనసాగుతుందేమో చూడాలి మరి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: