గత ఏడాది సంక్రాంతికి వచ్చిన హిలేరియస్ ఎంటర్ టైనర్ `ఎఫ్ 2`… ఏ స్థాయిలో పెర్ ఫార్మ్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ తమన్నా, స్టన్నింగ్ బ్యూటీ మెహరీన్ ప్రధాన పాత్రల్లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీకి… త్వరలో సీక్వెల్ రానుంది. దాదాపుగా`ఎఫ్ 2`లో నటించిన వాళ్ళందరూ… `ఎఫ్ 3`లోనూ కొనసాగే అవకాశముందని ప్రచారం సాగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
అంతేకాదు.. వెంకీ, వరుణ్ తో పాటు మరో స్టార్ కూడా `ఎఫ్ 3`లో సందడి చేస్తారట. ఆ స్టార్ మరెవరో కాదు… సూపర్ స్టార్ మహేష్ బాబు. సినిమా సెకండాఫ్ లో వచ్చే ఈ పాత్ర కోసం మహేష్ దాదాపు 13 రోజుల కాల్షీట్స్ కేటాయించనున్నారని… అతనికి జోడీగా రష్మిక లాంటి స్టార్ హీరోయిన్ నటించే అవకాశముందని టాక్. అనిల్ దర్శకత్వంలో వచ్చిన `సరిలేరు నీకెవ్వరు` బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో… మహేష్ కూడా ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అలాగే తన పాత్ర కూడా ఫుల్ ఎంటర్ టైనింగ్ గా సాగేది కావడంతో ఆసక్తి చూపిస్తున్నారట. త్వరలోనే మహేష్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
`దిల్` రాజు నిర్మాణంలో తెరకెక్కనున్న `ఎఫ్ 3` మే నుంచి పట్టాలెక్కి, 2021 సంక్రాంతికి రిలీజ్ అయ్యే దిశగా నిర్మాణం జరుపుకోనుందని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: