వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెలుగులో పింక్ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. అన్ని పనులు త్వరలో పూర్తి చేసి మే 15 వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో నివేదా థామస్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా.. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ‘పింక్’ రీమేక్ తో పాటు క్రిష్ దర్శకత్వంలో కూడా ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ప్లాన్లో ఉన్నారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో కథ వుండబోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాబిన్ హుడ్ అని పిలవబడే తెలంగాణకు చెందిన ‘పండుగల సాయన్న’ అనే ఒక యోధుడి జీవిత ఆధారంగా సినిమా తెరకెక్కుతున్నట్లు టాక్స్ వినిపిస్తున్నాయి.
[custom_ad]
ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది. ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును పెట్టాలని అనుకుంటున్నారట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.
ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత పవన్ 28వ సినిమా హరీష్ శంకర్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా ఈ చిత్రం తెరకెక్కనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: