పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో ఓ పిరియాడికల్ ఫిల్మ్ రాబోతున్న సంగతి తెలిసిందే. పాన్ – ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని.. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం నిర్మిస్తున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే…. మొఘలాయిల పరిపాలనా కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఇందులో పవన్ పాత్ర పేరు `వీర` అని, సినిమా టైటిల్ గా `విరూపాక్షి`ని పరిశీలిస్తున్నారని సమాచారం.
[custom_ad]
అంతేకాదు.. ఇద్దరు నాయికలకు స్థానమున్న ఈ చిత్రంలో ఇప్పటికే సెకండ్ లీడ్ గా `కంచె` ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ ని ఎంపికచేసిన క్రిష్… మెయిన్ హీరోయిన్ గా కీర్తి సురేష్ పేరుని పరిశీలిస్తున్నట్లు టాక్. ఇప్పటికే పవన్ – కీర్తి కాంబోలో `అజ్ఞాతవాసి` రూపొందిన సంగతి తెలిసిందే. త్వరలోనే టైటిల్, కథానాయికల వివరాలపై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది. కాగా, 2021 ఆరంభంలో పవన్ – క్రిష్ మూవీ తెరపైకి రానుంది..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: