పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రావడం కేవలం పవన్ అభిమానులకే కాదు ప్రతి సినీ ప్రేక్షకుడికి ఆనందకరమైన విషయమే. ‘జనసేన’ పార్టీ స్థాపించి తన పూర్తి జీవితాన్ని ఇక రాజకీయాలకే అంకితం చేస్తానని చెప్పాడు. దీనితో పవన్ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. అయితే రాజకీయాల్లో తమ హీరో కష్టపడుతున్నాడులే అని.. ఆ రకంగా సపోర్ట్ చేస్తూ సరిపెట్టుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం వరుస సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అందులో ఒకటి పింక్ రీమేక్, ఇంకొకటి క్రిష్ సినిమా మరొక సినిమా హరీష్ శంకర్. ప్రస్తుతం పింక్ రీమేక్ షూటింగ్ ను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇదిలా ఉండగా క్రిష్ సినిమా గురించి ఇప్పుడు మరో వార్త ఒకటి చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో కథ వుండబోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే.. తెలంగాణ రాబిన్ హుడ్ అని పిలవబడే తెలంగాణకు చెందిన ‘పండుగల సాయన్న’ అనే ఒక యోధుడి జీవిత ఆధారంగా సినిమా తెరకెక్కుతున్నట్లు టాక్స్ వినిపిస్తున్నాయి. ఉన్నవాళ్ళ నుంచి దోచుకున్న సంపదను లేనోళ్లకి పంచేవాడట సాయన్న. అంతే కాదు ”ఉన్నోళ్ళని కొట్టిండు. లేనోళ్లకి పెట్టిండు. పండుగల సాయన్న వాడురాజులకు మొనగాడు” అన్న నినాదం ఇప్పటికీ మహబూబ్ నగర్ జిల్లాలో వినిపిస్తుంది. మరి చూద్దాం ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: