అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఎంత సంచలన విజయం దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకొని… రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న మహేష్ తిరిగొచ్చిన తర్వాత ఈ సినిమా మొదలవుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది ఈ సినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఈ సినిమాలో మహేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఒక పాత్ర గ్యాంగ్ స్టర్ గా మరో పాత్ర లెక్చరర్ గా ఉండబోతుందట. అంతేకాదు తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ‘భాషా’ సినిమా లైన్ లోనే వుండబోతున్నట్టు సమాచారం. మరి ఇది ఎంత వరకూ నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.
[custom_ad]
ప్రస్తుతం నటీనటులను, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసే పనిలో వున్నారు. అప్పటికే సంగీత దర్శకుడిగా థమన్ ను సెలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే కాస్ట్ అండ్ క్రూ కు సంబంధించిన వివరాలు తెలియజేయనున్నారు. ఇక వంశీ, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన ‘మహర్షి’ ఎంత సూపర్ హిట్ అయిందో తెలుసు. మరి ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: