పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన కనువిందు చేసిన కథానాయికల్లో శ్రుతి హాసన్ ఒకరు. `గబ్బర్ సింగ్` (2012)లో తొలిసారి జోడీకట్టిన పవన్, శ్రుతి… ఆ చిత్రంతో బ్లాక్ బస్టర్ పెయిర్ అనిపించుకున్నారు. ఆ తరువాత ఈ ఇద్దరు `కాటమ రాయుడు` (2017) కోసం జట్టుకట్టారు. కాగా, స్వల్ప విరామం అనంతరం ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్ లో సినిమా రానుందట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]




ఆ వివరాల్లోకి వెళితే.. పవన్ కళ్యాణ్, `గబ్బర్ సింగ్` దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లోనే శ్రుతి నాయికగా నటించనుందని సమాచారం. ఈ ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. కాగా, శ్రుతి ఎంట్రీపై క్లారిటీ రావాల్సి ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























